Karimnagar Fire In Electric Bus: పర్యావరణ కాలుష్యం తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న వేళ, కరీంనగర్ ఆర్టీసీ 2 డిపోలో ఎలక్ట్రిక్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శనివారం ఉదయం కరీంనగర్ నుంచి జేబీఎస్ వెళ్లాల్సిన బస్సులో బ్యాటరీల నుంచి మంటలు రావడంతో ప్రయాణికులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ సకాలంలో స్పందించడంతో బస్సును కాపాడగలిగారు. పూర్తి వివరాలు మీకోసం