కరీంనగర్ మేయర్ పదవిని తామే దక్కించుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ప్రకటన చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకి అవసరమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీకి ఎక్కువ స్థానాలు రాగా.. ఇతర పార్టీలు, స్వతంత్రులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో.. మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.