కరీంనగర్ పట్టణంలో అరుదైన పునుగు పిల్లి ప్రత్యక్షమైంది. హిందూపురి కాలనీలో గుర్తించిన ఈ జీవిని అటవీశాఖ అధికారులు సురక్షితంగా పట్టుకుని డీర్పార్క్కు తరలించారు. అనారోగ్యంతో ఉన్న ఈ పిల్లికి వైద్యం అందించి, కోలుకున్నాక అడవిలో వదిలిపెడతామని అధికారులు తెలిపారు.