బాపట్ల జిల్లా సూరేపల్లిలో జరిగిన 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో భూ రికార్డులు అస్తవ్యస్తమయ్యాయని.. ప్రజల ఆస్తిపై మాజీ సీఎం తన ఫొటో వేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. అవినీతికి తావులేకుండా.. కరెన్సీ తరహా సెక్యూరిటీ ఫీచర్లు, క్యూఆర్ కోడ్, బ్లాక్చైన్ టెక్నాలజీతో కూడిన అత్యంత సురక్షితమైన పాసుపుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.12 కోట్ల పుస్తకాలను పంపిణీ చేయడమే లక్ష్యమని చంద్రాబాబు ప్రకటించారు.