Tdp Mla Kalava Srinivasulu In AP Assembly: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాల్మీకి, బోయలను ఎస్టీగా గుర్తించాలని అసెంబ్లీలో రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రస్తావించారు. కర్ణాటక రాష్ట్రంలో వాల్మీకి, బోయాలను ఎస్టీలుగా గుర్తించినట్లే, ఏపీలో కూడా వారికి అదే హోదా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ నిర్ణయం ద్వారా సామాజిక న్యాయం సాధ్యమవడంతో పాటు, విద్య, ఉపాధి రంగాల్లో ఈ వర్గాల అభివృద్ధికి మరింత అవకాశాలు కలుగుతాయి అన్నారు.