కర్నూలు జిల్లా ఆస్పర్తి మండలంలో దారుణం చోటుచేసుకుంది. అన్నను హత్య చేయించిందనే కోపంతో వదినను రోకలి బండతో కొట్టి హత్య చేశాడో మరిది. ఆస్పర్తి మండలం తొగలగల్లులో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు మూడు నెలల కిందటే గంగావతి తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించింది. ఈ కేసులో జైలు నుంచి ఇటీవలే బయటకు వచ్చింది.