Yemmiganur Road Accident: కర్నూలు జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఇవాళ ఉదయం ఎమ్మిగనూరు వద్ద రెండు కార్లు ఢీకొని ఐదుగురు చనిపోయారు. వీరంతా కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. మరో చోట బైక్ ఢీకొని ఒక రైతు మృతి చెందారు. ఇటీవల ఆళ్లగడ్డ సమీపంలో బస్సు, లారీ ఢీకొని ఇద్దరు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఇటీవల జరిగిన బస్సు అగ్నిప్రమాదంలో 19 మంది మరణించిన ఘటన మరవకముందే ఈ ప్రమాదాలు జరిగాయి.