కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతున్న పిల్లలపై పిడుగు పడింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని కాత్రికిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని ఆదోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు పిడుగులతో కూడిన వర్షం పడే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వర్షం పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకపోవటం మంచిదని సూచిస్తున్నారు.