కర్నూలు జిల్లావాసులకు శుభవార్త. కర్నూలు- విశాఖ మధ్య నూతన ఏసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. మంత్రి టీజీ భరత్.. కర్నూలు విశాఖపట్నం మధ్య మూడు నూతన ఏసీ బస్సు సర్వీసులు ప్రారంభమించారు. ఏసీ బస్సులు అందుబాటులోకి రావటంతో పర్యాటకంగా ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. మరోవైపు ఇటీవల జరిగిన బస్సు ప్రమాదాల పట్ల మంత్రి టీజీ భరత్ స్పందించారు. ఈ ఘటనలు చాలా బాధకరమని అభిప్రాయపడ్డారు.