కర్నూలు జిల్లాలోని ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయానికి భారీ విరాళం ఇచ్చారు ఓ భక్తుడు. బళ్లారికి చెందిన తిప్పయ్య అనే భక్తుడు రూ. 7 కోట్ల విలువైన భూమిని విరాళంగా ఇచ్చారు. రూ.5 లక్షల కంటే ఎక్కువ విరాళం ఇచ్చిన వారికి వీఐపీ దర్శనం కల్పించే ఏర్పాటు చేస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అలాగే అలయ అభివృద్ధిలో భాగంగా.. అన్నదాన భవనం, సీసీ రోడ్లు, తాగునీటి ట్యాంకు వంటి పలు పనులు చేపట్టామన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఆలయ ఆదాయం దాదాపు రూ.5కోట్లు పెరిగినట్లు వెల్లడించారు.