Kurnool Bus Accident Rs 40 Lakh Compensation: కర్నూలు దగ్గర జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో బాధితులకు వి.కావేరి ట్రావెల్స్ రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించింది. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి సాయం చేశారు. అయితే, ఈ ప్రమాదానికి కారణం బస్సును నిబంధనలకు విరుద్ధంగా మార్చడమేనని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు. ఇలాంటి చట్టవిరుద్ధ పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని.. నేరుగా జైలుకే అంటూ వార్నింగ్ ఇచ్చారు.