రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర విషాదం నింపిన కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి మరో సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది.మరో బస్సులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో అసలు ఏం జరిగిందనేది రికార్డైంది. బైక్ ప్రమాదంలోచనిపోయిన శివశంకర్ మృతదేహం, అతని స్నేహితుడు ఎర్రిస్వామి రోడ్డుకు ఒక పక్కన ఉన్న దృశ్యాలు ఇందులో నమోదయ్యాయి. అలాగే డివైడర్ పక్కగా బైక్ పడి ఉంది. అలాగే ఘటనాస్థలికి సమీపంలోని మరో సీసీటీవీ ఫుటేజీ కూడా వెలుగులోకి వచ్చింది.