తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు విషాదం నింపిన సంగతి తెలిసిందే. కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు. శ్రీకాకుళం కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటలోనూ ప్రాణనష్టం జరిగింది. తాజాగా ఈ ప్రమాదాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని అన్నారు. టెక్నాలజీతో ఈ ప్రమాదాలను అరికట్టాలన్నారు. అయితే విధానాల్లో లోపాల గురించి చర్చించాలని.. లేకపోతే ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరిగే ప్రమాదం ఉందన్నారు.