కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుని 19 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం మత్తులో బైక్ నడిపిన శివశంకర్, డివైడర్ను ఢీకొని మరణించాడు. అతని బైక్ను కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొని, 200 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగి 19 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి ముందు బైక్పై మరో యువకుడు కూడా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీలు, విచారణలో తేలింది.