కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. గుర్తుపట్టలేకుండా మారిన మృతదేహాలను ఇటీవల బంధువులకు అప్పగించారు. అయితే ప్రమాద స్థలంలో కొందరు చేస్తున్న పనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుదూర ప్రాంతం నుంచి వచ్చి మరీ.. బంగారం కోసం ఘటన స్థలంలో కొందరు వ్యక్తులు జల్లెడ పడుతున్నారు.