కర్నూలు: హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోనే దొంగతనం.. ఈ దొంగలు మామూలోళ్లు కాదుగా!

1 hour ago 1
కర్నూలులోని శ్రీనివాసనగర్‌లో వరుస దొంగతనాలు జరగడం అక్కడి స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. ఒక హెడ్ కానిస్టేబుల్ ఇంటినే టార్గెట్ చేసి వారి ఇంట్లో బంగారం, నగదు అపహరించారు. అదే ప్రాంతంలో ఉన్న విశ్రాంత ఆర్ఎస్‌ఐ ఇంట్లోనూ చోరీ జరిగింది. వరుస చోరీలు జరగడంపై పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్న పోలీసులు పాత రికార్డులను కూడా చూస్తున్నారు. తమ ప్రాంతంలో రాత్రి వేళ గస్తీ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Read Entire Article