కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకుంది. అందులో భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు కావాల్సిన అనువైన స్థలాన్ని పరిశీలించేందుకు న్యాయమూర్తుల బృందం కర్నూలులో పర్యటించనుంది. ఫిబ్రవరి 6వ తేదీన కర్నూలులో హైకోర్టు జడ్జిల బృందం పర్యటించనున్నట్లు ఏపీ మంత్రి ఫరూక్ వెల్లడించారు. కర్నూలు దిన్నెదేవరపాడు వద్ద ఉన్న విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ భవనాన్ని జడ్జిల బృందం పరిశీలించనుంది. మరోవైపు ఈ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.