కర్మన్ఘాట్ హనుమాన్ ఆలయానికి చెందిన 2 ఎకరాల 11 గుంటల భూమి కబ్జాకు గురైంది. ఆక్రమణదారులపై ఎండోమెంట్ అధికారులు చర్యలు తీసుకుని.. అందులోని 11 ఇళ్లను జప్తు చేశారు. కాగా, గత 35 ఏళ్లుగా నివసిస్తున్న తమను అన్యాయంగా ఖాళీ చేయించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.