తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన నవంబర్ 10, 2025 న ఉదయం లాలాగూడలోని తన నివాసంలో కుప్పకూలిపోయారు. ప్రభుత్వం బహుకరించిన 348 గజాల స్థలంలో ఘట్కేసర్లో ఆయన ఎంతో ఆశగా నిర్మించుకుంటున్న G+3 పెంట్ హౌస్ పూర్తి కాకముందే మరణించడం తీరని బాధాకరం. చనిపోయే ముందు రోజు సాయంత్రం వరకు కూడా ఆయన కొత్త ఇంటి పనులను పర్యవేక్షించారు. ఆయన మరణం సాహితీ లోకానికి తీరని లోటు.