అశ్వాపురంలో భూభారతి అవగాహన సదస్సులో ఒక రైతు తన భూమి రికార్డుల్లో నమోదు చేయడానికి లంచం అడుగుతున్నారని ఫిర్యాదు చేయగా.. కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెంటనే ఏసీబీకి ఫిర్యాదు చేయమని రైతుకు సూచించారు. కలెక్టర్ స్పందనతో రెవెన్యూ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వారి ముఖాల్లో భయం స్పష్టంగా కనిపించింది. కలెక్టర్ మాటలతో అవగాహన సదస్సుకు హాజరైన రైతుల ముఖాల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.