ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు. ఏప్రిల్ 27వ తేదీన జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం అనివార్యమని కేసీఆర్ చెప్పారు.