కశ్మీర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన.. అసదుద్దీన్ ఓవైసీ..

10 months ago 27
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రదాడిని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి ఉరి , పుల్వామా దాడుల కంటే అత్యంత ఘోరమైనదని.. ఇది తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన అన్నారు. నిఘా వైఫల్యం కారణంగానే ఈ దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దాడి భద్రతా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోందని, ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలని ఒవైసీ అన్నారు. పర్యాటకుల భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని వెళ్లాలని ఆయన సూచించారు.
Read Entire Article