Ramreddy Damodar Reddy Death: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్రెడ్డి (73) కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో హైదరాబాద్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఐటీ మంత్రిగా సేవలందించిన ఆయన, ఉమ్మడి నల్గొండ జిల్లాకు శ్రీరాంసాగర్ జలాల కోసం ఎంతో కృషి చేశారు. ఆయన మరణంపై ముఖ్యమంత్రితో సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలు ఈ నెల 4న తుంగతుర్తిలో జరగనున్నాయి.