కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన విజయోత్సవాలను రాష్ట్రమంతటా కన్నుల పండువలా నిర్వహించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. తొలి ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాల ప్రగతి నివేదికతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తు ప్రణాళికను ప్రజల ముందు ఆవిష్కరించాలన్నారు. హైదరాబాద్ నగరంలో డిసెంబర్ 7,8,9 తేదీల్లో తెలంగాణ వైభవం వెల్లివిరిసేలా ఉత్సవాలు నిర్వహించాలన్నారు.