రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చెక్డ్యామ్ కూడా సరిగ్గా కట్టలేని కాంగ్రెస్ నాయకులు.. కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేయడం ఏంటని మండిపడ్డారు. కాంగ్రెస్ కాంట్రాక్టర్ నిర్మించిన చెక్డ్యా్మ్.. రెండు నెలల్లోనే కూలిపోవడంపై విమర్శలు గుప్పించారు. నాణ్యత లేని నిర్మాణం చేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని.. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.