కాకినాడ పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. నూకరాజు కుమార్తె సౌజన్య మృతదేహాన్ని కొమరాజులంక వద్ద గుర్తించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ నూకరాజు, అతని కుమార్తె సౌజన్య మృతదేహాలు లభ్యమయ్యాయి. నూకరాజు భార్య మీనా మృతదేహం కోసం గాలిస్తున్నారు. మరోవైపు నూకరాజు మనవడు పదేళ్ల కార్తికేయరెడ్డి ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే.