తిరుమలలలో వన్యప్రాణుల సంరక్షణ, భక్తుల భద్రతకు టీటీడీ సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. ఆధునిక సాంకేతికతను వినియోగించి ఈ అంశాలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా తిరుమలలో రోబోట్ డాగ్ వినియోగాన్ని టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. రోబోట్ డాగ్ ద్వారా తిరుమల అటవీ ప్రాంతాల్లో రియల్టైమ్ మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారు.