అసలు ఏమైంది.. ఎందుకంత కఠిన నిర్ణయం.. కాకినాడ జిల్లా రేచర్లపేటలో జరిగిన ఘటనపై ఇప్పుడు ఇవే అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రేచర్లపేటలోని ఓ ఇంట్లో.. ఓ గదిలో తల్లీ, కుమారుడి మృతదేహాలు కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నాయి. అయితే ఇది హత్యా, ఆత్మహత్యా అనేది తెలియాల్సి ఉంది. చనిపోయిన మహిళ రెండు నెలల కిందట అబుదాబి నుంచి వచ్చినట్లు తెలిసింది