Kakinada Consumer Forum Hotel Rs 27 Lakhs Fine: కాకినాడ వినియోగదారులు కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. ఓ కస్టమర్ నుంచి వాటర్ బాటిల్స్పై అదనంగా డబ్బులు వసూలు చేసినందుకు హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్కు రూ.27లక్షల 27వేలు జరిమానా విధించింది. రూ.27 లక్షలు తెలంగాణ సీఎం సహాయ నిధికి.. ఫిర్యాదు చేసిన వ్యక్తికి రూ.25000, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ2000 చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది.