pawan kalyan kakinada jahnavi missing case: కాకినాడ జిల్లా తుని బాలిక జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుపై ఆరా తీసిన పవన్ కళ్యాణ్.. జిల్లా ఎస్పీతో మాట్లాడారు. గాలింపు చర్యలు కొనసాగుతున్న తీరును తెలుసుకున్నారు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటుగా ఎన్డీఆర్ఎఫ్ బలగాలను రంగంలోకి దింపాలని ఆదేశించారు. అలాగే ఫారెస్ట్ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ వాచర్స్, నిపుణులను సైతం రంగంలోకి దించాలని.. బాలిక ఆచూకీని వీలైనంత త్వరగా కనిపెట్టాలని స్పష్టం చేశారు.