కాకినాడ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనలో 21 మంది వరకూ చనిపోయారు. పలువురు గాయపడ్డారు .మరోవైపు ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉండటానికి స్థానిక పరిస్థితులే కారణమనే విశ్లేషణ వినిపిస్తోంది. భారీ పేలుడుతో పాటుగా రెండు గంటలపాటు పేలుళ్లు కొనసాగటం తీవ్రత పెరగడానికి కారణంగా భావిస్తున్నారు. అలాగే బాణాసంచా తయారీ కేంద్రం పొలాల్లో ఉండటం, సరైన మార్గం లేకపోవటం కూడా సహాయకచర్యలకు ఇబ్బందికరంగా మారినట్లు తెలిసింది.