ఏపీలో ఇప్పుడు కాకినాడ పోర్టు వ్యవహారం హాట్ టాపిక్గా ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై అధికార టీడీపీ, విపక్ష వైసీపీ నేతల మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శలు జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు పర్యటన తర్వాత ఈ వ్యవహారం ఏపీలో రాజకీయ రచ్చకు కారణమైంది. మరోవైపు కాకినాడ పోర్టు మాఫియాపై సినిమా చేయడానికి సిద్ధమంటూ హీరో నందమూరి బాలకృష్ణ తెలిపారు. కాకినాడలో గురువారం పర్యటించిన నందమూరి బాలకృష్ణ ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బాలయ్య సమాధానం ఇచ్చారు.