కాకినాడలో మత్స్యకారుల గేలానికి భారీ కొమ్ముకోనం చేప చిక్కింది. 12 అడుగుల పొడవు, 520 కిలోల బరువు ఉండే భారీ కొమ్ముకోనం చేప చిక్కింది. ఈ బాహుబలి చేపను చూసేందుకు స్థానికులు తరలి వచ్చారు. క్రేన్ సాయంతో ఈ భారీ చేపను కుంభాభిషేకం రేవుకు తరలించారు. అక్కడ నిర్వహించిన వేలంలో ఈ కొమ్ముకోనం చేప ఏకంగా 65 వేల రూపాయలు పలికింది. ఓ వ్యాపారి 65 వేలకు ఈ భారీ కొమ్ముకోనం చేపను సొంతం చేసుకున్నారు. వీటికి ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది.