Pakistani Nationals Await To Stay In Kakinada: జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ జాతీయులు దేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. ఏపీలోనూ పాకిస్థానీయులు ఉన్నట్లు గుర్తించారు. అయితే, కొందరికి లాంగ్ టర్మ్ వీసాలు ఉండటంతో వారిని ఇక్కడే ఉండనిస్తున్నారు. కాకినాడలో ఇద్దరు పాకిస్థాన్ మహిళలు ఎల్టీవీతో ఉంటున్నారు. భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కాకినాడ తీరంలో భద్రత కట్టుదిట్టం చేశారు. అలాగే అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచారు.