కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. టిప్పర్ లారీ బీభత్సం, నలుగురు కూలీలు మృతి

1 hour ago 1
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాకినాడ రూరల్ పరిధిలోని కొవ్వూరు బ్రిడ్జి సమీపంలో పొట్టకూటి కోసం ఉపాధి హామీ పనులకు కాలినడకన వెళ్తున్న కూలీలపైకి ఒక అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో నలుగురు కూలీలు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Entire Article