Facade Lighting System at Kacheguda Railway Station: హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్కు మహర్దశ పట్టింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రూ.2.23 కోట్లతో ఫసాడ్ లైటింగ్ సిస్టమ్ను ప్రారంభించారు. త్రివర్ణపతాకం రంగుల్లో స్టేషన్ వెలిగిపోతోంది. తెలంగాణలో రూ.42,219 కోట్ల రైల్వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, 40 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. వరంగల్లో రూ.700 కోట్లతో రైల్వే వ్యాగన్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.