కాణిపాకం ఆలయంలో అపచారం జరిగింది. అంతరాలయంలో ఫోటోలు తీయడం నిషేధం. అయితే ఇటీవల విదేశీ భక్తుల బృందం ఆలయాన్ని సందర్శించింది. ఈ బృందంలోని ఓ వ్యక్తి అంతరాలయంలో హారతి ఇస్తున్న సమయంలో ఫోటోలు తీశారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. దీనిపై భక్తుల నుంచి ఆగ్రహం వ్యక్తం కావటంతో తీసిన మహిళ క్షమాపణలు తెలిపారు. తెలియక చేశానని.. క్షమించాలని కోరారు. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించినట్లు చెప్పారు.