Kanipakam Temple Damaged Milk: చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో పాలాభిషేకం కోసం తెచ్చిన పాలు విరిగిపోవడంతో కలకలం రేగింది. భక్తురాలు సమర్పించిన 10 లీటర్ల పాలు పనికిరావని గుర్తించి, ఈవో పెంచల కిషోర్ వాటిని పారబోయించారు. పాలు సరఫరా చేసే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకున్నారు.. మరోసారి ఈ తప్పు జరగదు అన్నారు. తిరుమల తరహాలో ఉచిత సేవలు ప్రారంభించాలని, భక్తులకు మెరుగైన సేవలు అందించాలని దేవాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ నిర్ణయించారు.