Kanipakam Temple Antaralaya Darshan: శ్రీకాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో అంతరాలయ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రూ.500 టికెట్తో భక్తులు ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారిని దర్శించుకోవచ్చు. అంతరాలయం దర్శనం చేసుకున్న వారికి ఉచిత అభిషేకం, లడ్డూ అందజేస్తారు. అలాగే, ఆన్లైన్లో దర్శనం, వసతి, సేవలు, ప్రసాదం టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గత నెలలో కాణిపాకం ఆలయానికి ఐఎస్వో గుర్తింపు కూడా లభించిన సంగతి తెలిసిందే.