తెలంగాణ పోలీసు శాఖలో కానిస్టేబుళ్లు హెడ్కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందేందుకు పడుతున్న సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. ప్రస్తుతం ఉన్న సిబ్బంది నిష్పత్తిని సవరించి 4 (కానిస్టేబుల్) : 2 (హెడ్కానిస్టేబుల్) : 1 (ఏఎస్సై) నిష్పత్తిని అమలు చేయాలని డీజీపీ ప్రభుత్వానికి నివేదించారు. దీనివల్ల దాదాపు 15,582 మందికి పదోన్నతులు లభించనున్నాయి. తద్వారా సిబ్బందిలో నిస్తేజం తొలగి పనితీరు మెరుగుపడుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. త్వరలోనే కొత్త ప్రమోషన్ల విధానంపై సర్కార్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.