Tirupati Son in Law killed Mother in Law: తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో అల్లుడు దారుణానికి ఒడిగట్టాడు. భార్యను కాపురానికి పంపడం లేదని ఆగ్రహించిన వెంకయ్య అనే వ్యక్తి, అత్త చెంగమ్మను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని స్వర్ణముఖి నది తీరంలో పాతిపెట్టాడు. అయితే, చెంగమ్మ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు నిలదీయగా, నేరం అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.