ఉగాది పండగ వేళ కామారెడ్డి జిల్లా వెంకటాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ప్రమాదవశాత్తు పడి తల్లి సహా ముగ్గురు పిల్లలు మృతి చెందారు. బట్టలు ఉతికేందుకు వెళ్లి చెరువులో జారిపడి చనిపోయినట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.