హైడ్రాపై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ.. కూల్చివేతలకు సంబంధించి కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. కొన్ని నిర్మాణాలను మాత్రమే సెలెక్టివ్గా కూల్చివేయడానికి గల కారణాలను వివరించారు. పర్మిషన్లు ఉన్న ఒక్క నిర్మాణాన్ని కూడా హైడ్రా అధికారులు కూల్చివేయలేదని తెలిపారు. కూల్చివేతలను, రోడ్ల విస్తరణను కూడా వ్యతిరేకంగా చూస్తారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.