కారు దిగేందుకు జగన్ ప్రయత్నం.. అడ్డుకున్న చిత్తూరు జిల్లా ఎస్పీ

8 months ago 17
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంలో ఓ వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు గాయాలయ్యాయి.. ఈ విషయం తెలిసి.. బంగారుపాళ్యం వద్ద కారు దిగేందుకు వైఎస్‌ జగన్‌ ప్రయత్నించారు. కార్యకర్త వద్దకు వెళ్లేందుకు జగన్‌ ప్రయత్నించారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ను కారు దిగకుండా ఎస్పీ మణికంఠ అడ్డుకున్నారు. వైఎస్‌ జగన్‌ కారు దిగకుండా.. అక్కడి నుంచి పంపించేశారు. పోలీసులపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయపడిన పార్టీ కార్యకర్తను పరామర్శించనివ్వరా అంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదెక్కడి న్యాయం అంటూ మండిపడ్డారు.
Read Entire Article