కారుతో ఢీకొట్టి.. కత్తులతో నరికి.. హైదరాబాద్‌లో దారుణ హత్య

4 weeks ago 6
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురవటం సంచలనంగా మారింది. శనివారం (మార్చి 22న) అర్ధరాత్రి మహేశ్‌ అనే వ్యక్తిని దుండగులు కారుతో ఢీకొట్టారు. ఈ ప్రమాదం నుంచి చిన్న చిన్న గాయాలతో మహేశ్‌ తప్పించుకోవడంతో.. దుండగులు గొడ్డలి, కత్తులతో వెంబడించి మరీ దాడి చేశారు. తలపై గొడ్డలితో నరకటంతో తీవ్ర రక్తస్రావమైన మహేష్ ప్రాణాలు కోల్పోయాడు. మహేశ్ ఇటీవలే ఓ మర్డర్ కేసులో బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. పాత కక్షల నేపథ్యంలోనే మహేష్‌ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
Read Entire Article