నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడ కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు ఎగబడుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నిధులతో కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసిన ఈ పాఠశాలలో స్మార్ట్ క్లాసులు, ఏఐ బోధన, డిజిటల్ ల్యాబ్స్ వంటి అత్యాధునిక వసతులు ఉండటంతో ప్రైవేట్ స్కూళ్లను వదిలి ఇక్కడ చేర్పించేందుకు పిల్లల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. సీట్లు పరిమితంగా ఉండటంతో అడ్మిషన్ల కోసం భారీగా రద్దీ నెలకొంది. ఉదయం నుంచే స్కూల్ గేటు మందు క్యూలైన్లలో వేచి ఉంటున్నారు.