చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం టీడీపీ మాజీ ఇంఛార్జి చల్లా బాబు (చల్లా రామచంద్రారెడ్డి) కన్నీరు పెట్టుకున్నారు. కార్యకర్తలతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. 40 ఏళ్లుగా టీడీపీలో పనిచేస్తున్నానని.. అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని.. ఏ సమయంలోనైనా తనను కలవొచ్చంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.