అల్లూరి జిల్లాలోని కొండ కుమ్మరి వర్గానికి ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కొండ కుమ్మరి సామాజికవర్గానికి ఎస్టీ గుర్తింపు ఇస్తూ నిర్ణయించింది. ఎస్టీలోని నాయక్ తెగకు చెందిన వారిగా గుర్తిస్తూ కుల ధ్రువీకరణ పత్రాలు అందించనున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం అమల్లోకి తెచ్చింది. పలువురు విద్యార్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు కూడా అందించారు.