కార్యాచరణలోకి దిగిన చాగంటి.. నారా లోకేష్‌తో భేటీ.. ఆ విషయాలపైనే ప్రధానంగా చర్చ

6 months ago 7
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు .. ఏపీ మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం లోకేష్ నివాసానికి వెళ్లిన చాగంటి కోటేశ్వరరావు.. ఆయనతో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై వీరిద్దరూ చర్చించారు, చాగంటి కోటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే నైతిక విలువల సలహాదారుగా నియమించింది. ఆ పదవిని ఆయన కూడా స్వీకరించారు. తాజాగా మంత్రి నారా లోకేష్‌ను కలిసి.. పలు అంశాల గురించి ఆయనతో చర్చించారు. మరోవైపు నేటి యువత పెద్దలను, గురువులను గౌరవించేలా పాఠ్యాంశాలు రూపొందించాలని తీసుకున్న నిర్ణయంపై చర్చించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు.
Read Entire Article