AP High Court On Guntur Degree Results: కాలేజీల తప్పులకు విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెట్టకూడదని ఏపీ హైకోర్టు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి స్పష్టం చేసింది. 2022-25 బ్యాచ్ విద్యార్థుల 6వ సెమిస్టర్ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అఫిలియేషన్ ఫీజులు చెల్లించలేదన్న కారణంతో ఫలితాలు ఆపడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. డబ్బులు రాబట్టుకోవడానికి ఇతర మార్గాలను చూడాలని సూచించింది. విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పింది.